కొవిడ్‌తో కేశవ ప్రసాద్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-08T09:04:00+05:30 IST

కూచిపూడి నాట్యాచార్యులు, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ కొవిడ్‌తో శుక్రవారం మృతిచెందారు

కొవిడ్‌తో కేశవ ప్రసాద్‌ మృతి

కూచిపూడి, మే 7: కూచిపూడి నాట్యాచార్యులు, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ కొవిడ్‌తో శుక్రవారం మృతిచెందారు. కూచిపూడి నాట్యకుటుంబంలో పుట్టిన కేశవప్రసాద్‌ తిరుపతి విశ్వవిద్యాలయంలో బీఏ సంస్కృతం చదివారు. జెడ్పీ హైస్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేశారు. నాట్యంపై మక్కువతో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలిని స్థాపించి ఏటా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కేశవ ప్రసాద్‌ మృతి కళారంగానికి తీరని లోటని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. 


వలంటీర్‌ మృతి

కరోనా వైరస్‌ బారిన పడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గ్రామ వలంటీర్‌ మృతిచెందింది. రమణయ్యపేటకు చెందిన సేనాపతి అనిత కరోనాతో మృతిచెందడతో జగ్గంపేట ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామినిచ్చారు.ృ

Updated Date - 2021-05-08T09:04:00+05:30 IST