Kesarapally జాతీయ రహదారిపై బైక్‎ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-11-08T12:44:45+05:30 IST

గన్నవరం మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సావర గూడెం జంక్షన్ వద్ద ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి

Kesarapally జాతీయ రహదారిపై బైక్‎ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సావర గూడెం జంక్షన్ వద్ద ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును గన్నవరం పోలీస్ స్టేషన్ తరలించారు.

Updated Date - 2021-11-08T12:44:45+05:30 IST