కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింస భరించలేక భార్య ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2021-06-22T16:36:28+05:30 IST

కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన...

కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింస భరించలేక భార్య  ఏం చేసిందంటే...

తిరువనంతపురం (కేరళ): కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళలోని కొల్లం జిల్లా శాస్తంకోట  గ్రామంలో విస్మయ అనే 24 ఏళ్ల మహిళ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ విద్యార్థిని. విస్మయను కొల్లం జిల్లాకు చెందిన మోటారు వాహనాల విభాగం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టరు కిరణ్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి నాటి నుంచి కిరణ్ కట్నం కోసం విస్మయను వేధించడం మొదలుపెట్టాడు.భర్త రాగానే కొట్టి తనను కాలి తన్నేవాడని విస్మయ తండ్రికి చెప్పింది. భర్త కొట్టిన దెబ్బలను వాట్సాప్ ద్వారా పంపించి విస్మయ ఆత్మహత్య భర్త తరచూ హింసిస్తుండటంతో మనోవేదనతో బాత్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విస్మయ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T16:36:28+05:30 IST