భర్త కారు పార్కింగ్ చేస్తుండగా.. అనుకోకుండా కారు భార్య మీదకు దూసుకెళ్లడంతో..

ABN , First Publish Date - 2021-01-18T23:10:05+05:30 IST

యూఏఈలో గత శనివారం జరిగిన కారు ప్రమాదంలో భారత్‌కు చెందిన 45 ఏళ్ల లిజి అనే మహిళ మరణించినట్టు సోమవారం అధికారులు

భర్త కారు పార్కింగ్ చేస్తుండగా.. అనుకోకుండా కారు భార్య మీదకు దూసుకెళ్లడంతో..

దుబాయి: యూఏఈలో గత శనివారం జరిగిన కారు ప్రమాదంలో భారత్‌కు చెందిన 45 ఏళ్ల లిజి అనే మహిళ మరణించినట్టు సోమవారం అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లిజి, ఆమె భర్త శనివారం హెల్త్ చెకప్ కోసం ఓ ఆస్పత్రికి వెళ్లారు. కారును పార్క్ చేయడం కోసం పార్కింగ్ స్థలానికి వెళ్లగా.. భర్తకు పార్కింగ్ డైరెక్షన్ ఇచ్చేందుకు లిజి కారు దిగింది. కారు ముందు లిజి నిలబడి ఉన్న సమయంలో కారు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకెళ్లింది. కారు వేగంగా ముందుకు రావడంతో లిజి అక్కడే ఉన్న గోడకు బలంగా గుద్దుకుంది. 


చికిత్స అందించేలోపే లిజి మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. లిజి మరణం పట్ల యూఏఈలోని ఇండియన్ ఎంబసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లిజి మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఎంబసి చెప్పింది. కాగా.. లిజి, ఆమె భర్త స్వస్థలం కేరళ. దాదాపు పదేళ్ల నుంచి యూఏఈలో నివసిస్తున్నారు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉండగా.. కొడుకు భారత దేశంలోనే చదువుకుంటున్నాడు.

Updated Date - 2021-01-18T23:10:05+05:30 IST