కేరళలో కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-07T01:46:45+05:30 IST

కేరళలో కరోనా పంజా

కేరళలో కరోనా పంజా

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజువారీగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రోజు కొత్తగా కేరళలో 42,464 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే అని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,86,396 కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ వైరస్ వల్ల మరో 63 మంది రోగులు చనిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 5,628కు చేరుకుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ నుంచి 27,152 మంది రోగులు కోలుకున్నారని, రికవరీల సంఖ్య 13.89 లక్షలకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2021-05-07T01:46:45+05:30 IST