అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన నటి రాధ
ABN , First Publish Date - 2021-03-08T04:17:22+05:30 IST
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన నటి రాధ
తిరువనంతపురం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో నటి రాధ ఆదివారం బీజేపీలో చేరారు. తిరువనంతపురంలో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అమిత్ షా సమక్షంలో నటి రాధా, మాజీ బ్యూరోక్రాట్ కె.వి.బాలకృష్ణన్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.
షాంగుముగం ప్రాంతంలో కేరళ విజయ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ 'మెట్రో మ్యాన్' ఇ శ్రీధరన్ కూడా పాల్గొన్నారు.