Kerala Man won lottery: కొన్ని గంటల్లో ఇల్లు అమ్మబోతుండగా జాక్పాట్.. రూ. కోటి లాటరీ..
ABN , First Publish Date - 2022-07-31T01:32:08+05:30 IST
ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని వాటి నుంచి బయటపడడానికి ఇంటిని అమ్మకానికి పెట్టిన వ్యక్తిని చివరి నిమిషంలో అదృష్టం వరించింది.
ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని వాటి నుంచి బయటపడడానికి ఇంటిని అమ్మకానికి పెట్టిన వ్యక్తిని చివరి నిమిషంలో అదృష్టం వరించింది. ఏకంగా రూ.కోటి లాటరీ (Kerala Man won lottery) తగిలింది. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేరళలోని మంజేశ్వర్కు చెందిన మహ్మద్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భారీగా డబ్బు ఖర్చు పెట్టి కూతురి పెళ్లి చేశాడు. మిగిలిన డబ్బుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. అయితే కరోనా కారణంగా రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు.
ఇది కూడా చదవండి..
Viral video: పెళ్లి వేదికపై వరుడితో మరదలి సరసం.. షాకైన వధువు, బంధువులు!
అప్పులన్నీ తీర్చేందుకు తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కొనుగోలుదారుడితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. అయితే డీల్ పూర్తి కావడానికి రెండు గంటల ముందు మహ్మద్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. లాటరీ రోజువారీ ఫలితాల గురించి సమాచారం అందింది. తనకు రూ.కోటి లాటరీ తగిలినట్టు తెలుసుకుని మహ్మద్ ఎంతో సంతోషపడ్డాడు. `ఆ సమయంలో నా మన:స్థితిని వర్ణించేందుకు నా దగ్గర మాటలు లేవ`ని మహ్మద్ పేర్కొన్నాడు.
లాటరీ డబ్బులు మహ్మద్కు ఎప్పుడు చేరతాయనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. పన్నులు పోగా మహ్మద్కు దాదాపు 63 లక్షలు రావొచ్చని తెలుస్తోంది. `డబ్బులు ఎప్పుడు వచ్చినా ఫర్వాలేదు. నాకు లాటరీ వచ్చినట్టు తెలుసుకున్న రుణదాతలు నన్ను వేధించడం మానేశారు. కచ్చితంగా అందరి బాకీలు తీర్చేస్తాన`ని మహ్మద్ పేర్కొన్నాడు.