కేరళ వరద బాధితులకు బీజేపీ సాయం
ABN , First Publish Date - 2021-10-23T14:59:45+05:30 IST
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు, దరిమిలా సంభవించిన వరదల్లో వేలాది మంది చిక్కుకుపోవడంతో కర్ణాటక బీజేపీ మానవతా దృక్ఫథంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. బెంగళూ
- 4 వాహనాల్లో సహాయ సామగ్రి తరలింపు
బెంగళూరు(Karnataka): కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు, దరిమిలా సంభవించిన వరదల్లో వేలాది మంది చిక్కుకుపోవడంతో కర్ణాటక బీజేపీ మానవతా దృక్ఫథంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి శుక్రవారం సహాయ సామగ్రితో కూడిన నాలుగు వాహనాలు బయల్దేరి వెళ్లాయి. వీటికి పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు నిర్మల్ కుమార్ సురానా పచ్చజెండా చూపారు. బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ కుమార్ సురానా మీడియాతో మాట్లాడుతూ తాగునీటి బాటిళ్లు, బిస్కెట్లు, వస్ర్తాలు ఔషధాలతో సహా 20కు పైగా నిత్యావసర వస్తువులను వరద బాధితుల కోసం పంపించామన్నారు. ఇదే సందర్భంగా ఐటీబీటీ శాఖా మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వర్థనారాయణ కూడా హాజరై సామగ్రిని పరిశీలించారు.