ExitPolls: కేరళలో మళ్లీ వామపక్షాలే
ABN , First Publish Date - 2021-04-30T02:32:39+05:30 IST
రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో కేరళలో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి గతంలో లాగే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి కూడా కేరళలో ఎల్డీఎఫ్ కూటమే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే కేరళీయులు ఈసారి ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుపుతున్నాయి. మళ్లీ ఎల్డీఎఫ్ కూటమే అధికారంలోకి వస్తే కేరళలో ఇదో రికార్డు అవుతుంది. కాగా రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో కేరళలో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి గతంలో లాగే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్కో పార్టీకి వచ్చే స్థానాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
ఇండియా టుడే: 104-120 (ఎల్డీఎఫ్), 20-364 (యూడీఎఫ్), 0-2 (బీజేపీ)
రిపబ్లిక్ సీఎన్ఎక్స్: 72-80 (ఎల్డీఎఫ్), 58-64 (యూడీఎఫ్)
ఏబీపీ సీఓటర్: 71-77 (ఎల్డీఎఫ్), 62-68 (యూడీఎఫ్), 0-2 (బీజేపీ)
టైమ్స్నౌ సీఓటర్: 74 (ఎల్డీఎఫ్), 65 (యూడీఎఫ్), 1 (బీజేపీ)