కేరళలో కొత్తగా 62 కేసులు..కరోనా బారిన ఇద్దరు ఎయిర్ ఇండియా సిబ్బంది

ABN , First Publish Date - 2020-05-30T01:33:47+05:30 IST

కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 62 కేసులు వెలుగు చూడగా

కేరళలో కొత్తగా 62 కేసులు..కరోనా బారిన ఇద్దరు ఎయిర్ ఇండియా సిబ్బంది

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 62 కేసులు వెలుగు చూడగా, అందులో ఓ హెల్త్ వర్కర్, ఇద్దరు ఎయిర్ ఇండియా కేబిన్ సిబ్బంది ఉన్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1,150కి పెరిగింది. అలాగే, గల్ఫ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి (65) కరోనాతో మృతి చెందాడు. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. నేడు మరణించిన వ్యక్తి పథనంథిట్ట జిల్లా తిరువల్లకు చెందినవాడని, కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, నేడు 10 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 577 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. అలాగే, 1.24 లక్షల మంది పర్యవేక్షణలో ఉన్నట్టు సీఎం వివరించారు.  

Updated Date - 2020-05-30T01:33:47+05:30 IST