అదృష్టమంటే అతడిదే.. దుబాయ్ లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్న కేరళ వ్యాపారవేత్త!

ABN , First Publish Date - 2020-05-21T21:34:37+05:30 IST

కేరళలోని కొట్టాయానికి చెందిన వ్యాపారవేత్త రాజన్ కురియన్ (43)కు అదృష్టం వరించింది. దుబాయ్ డ్యూటీ

అదృష్టమంటే అతడిదే.. దుబాయ్ లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్న కేరళ వ్యాపారవేత్త!

తిరువనంతపురం: కేరళలోని కొట్టాయానికి చెందిన వ్యాపారవేత్త రాజన్ కురియన్ (43)కు అదృష్టం వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్) లాటరీలో విజేతగా నిలిచి మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. డీడీఎఫ్ మిలీనియం మిలియనీర్ డ్రాలో విజేతగా నిలిచిన కురియన్ కొట్టాయం నుంచి ‘గల్ఫ్ న్యూస్’తో మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో తనకు లాటరీలో మిలియన్ డాలర్లు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.  తాను గెలుచుకున్న మొత్తంలో కొంత మొత్తాన్ని అవసరార్థులకు సాయం నిమిత్తం వినియోగించనున్నట్టు తెలిపాడు. ఈ గెలుపునకు తాను కృతజ్ఞడిగా ఉంటానని పేర్కొన్నాడు.  


నిర్మాణ రంగంలో వ్యాపారవేత్తగా ఉన్న కురియన్ లాటరీ ద్వారా గెలుచుకున్న మొత్తంలో కొంత తన వ్యాపార అభివృద్ధికి వినియోగిస్తానని తెలిపాడు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఐదు నెలలుగా వ్యాపారం బాగా దెబ్బతిన్నదని, ఇప్పుడా పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుందని కురియన్ వివరించాడు.  


Updated Date - 2020-05-21T21:34:37+05:30 IST