ఆ ప్రకటనపై మండిపడిన హేమామాలిని
ABN , First Publish Date - 2020-05-28T12:11:01+05:30 IST
ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారుచేసే ఒక కంపెనీకి సంబంధించిన ప్రకటనపై నటి, బీజేపీ ఎంపి హేమామాలిని అభ్యంతరం వ్యక్తం చేశారు. విలువలను దిగజార్చే విధంగా ఈ ప్రకటన ఉందని అన్నారు.
న్యూ ఢిల్లీ: ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారుచేసే ఒక కంపెనీకి సంబంధించిన ప్రకటనపై నటి, బీజేపీ ఎంపి హేమామాలిని అభ్యంతరం వ్యక్తం చేశారు. విలువలను దిగజార్చే విధంగా ఈ ప్రకటన ఉందని అన్నారు. తాను సమాజంలోని అన్ని వర్గాలను గౌరవిస్తానని, వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. ఆ కంపెనీకి చెందిన డౌ అండ్ బ్రెడ్ మేకర్ ప్రకటన తీరు బాగోలేదని అన్నారు. ఈ ప్రకటనలో... మీ ఇంట్లో చపాతీల పిండిని కలిపే పనిని పనివారికి అప్పగిస్తున్నారా? వారి చేతులు ఇన్ఫెక్టెడ్ అయివుండవచ్చు. అందుకే చేతులను ఉపయోగించకుండా పిండిని మెత్తగా కలుపుకునే ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టండని ఉంది. కాగా ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో సదరు సంస్థ క్షమాణలు చెబుతూ, ఆ ప్రకటన ప్రసారాన్ని ఉపసంహరించుకుంది.