గొప్ప విజయం సాధించారు.. కంగ్రాట్స్: మమతపై కేజ్రీవాల్ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-05-02T21:06:11+05:30 IST
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఢిల్లీ ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మమత అద్భుత విజయం సాధించారని కొనియాడారు. గొప్పగా పోరాడారంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా బెంగాల్ సీఎంను అభినందించారు. శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారంటూ కొనియాడారు. ప్రజల సంక్షేమం, కరోనా వైరస్ను ఎదుర్కొనే విషయాల్లో కలిసి పనిచేద్దామన్నారు. కాగా, ఈ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి టీఎంసీ ముందంజలోనే ఉంది. అదే ఊపును చివరి వరకు కొనసాగించింది. బీజేపీ 90 లోపు స్థానాల్లోనే ఆధిక్యం కనబరచగా, టీఎంసీ 200కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.