కామారెడ్డిలో కీచక ప్రధానోపాధ్యాయుడు
ABN , First Publish Date - 2021-03-03T23:49:25+05:30 IST
జిల్లాలో విద్యార్థులను వేధిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడి భాగోతం
కామారెడ్డి: జిల్లాలో విద్యార్థులను వేధిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాస్ల పేరుతో విద్యార్థినుల నంబర్లను హెచ్ఎం దీప్లా రాథోడ్ సేకరించాడు. విద్యార్థినులకు వీడియోకాల్ చేసి అందాలు చూపించాలని హెచ్ఎం వేధింపులకు గురి చేశాడు. పాఠశాలలు తిరిగి ఈ మధ్యనే పున:ప్రారంభమయ్యాయి. డ్యాన్స్ నేర్పుతానంటూ విద్యార్థినులను గదిలోకి తీసుకెళ్లి పిల్లలతో హెచ్ఎం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెచ్ఎం వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఆ కీచక ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.