కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లకు పర్యాటక విమానం

ABN , First Publish Date - 2022-06-11T15:15:19+05:30 IST

చెన్నై నుంచి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల సందర్శనకు భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక పర్యాటక విమానం నడుపనుంది. చెన్నై

కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లకు పర్యాటక విమానం

ఐసిఎఫ్‌(చెన్నై), జూన్‌ 10: చెన్నై నుంచి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల సందర్శనకు భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక పర్యాటక విమానం నడుపనుంది. చెన్నై నుంచి ఈ నెల 29వ తేదీ బయల్దేరే ఈ పర్యటనలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి, రిషికేష్‌, హరిద్వార్‌ వంటి ప్రాంతాలు సందర్శించవచ్చు. 13 రోజుల పర్యటనకు ఒకరికి రూ.49,500, అలాగే, చెన్నై నుంచి జూలై 28వ తేదీ బయల్దేరే మరో విమాన పర్యటనలో అమృతనాఽథ్‌ మంచులింగం, శ్రీనగర్‌ ప్రాంతాలను నాలుగు రోజుల సందర్శనకు ఒకరికి రూ.53,800 ఛార్జీ నిర్ణయించారు. ఇతర వివరాలకు 9003140682, 8287931977 అనే నెంబర్లు సంప్రదించవచ్చు.

Updated Date - 2022-06-11T15:15:19+05:30 IST