అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట ఇచ్చి తప్పారు: రాజాసింగ్

ABN , First Publish Date - 2021-06-21T22:46:59+05:30 IST

సీఎం కేసీఆర్ పర్యటన కోసం గోషామహాల్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని బీజీపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట ఇచ్చి తప్పారు: రాజాసింగ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పర్యటన కోసం గోషామహాల్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్  అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గోషామహాల్‌లో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మాట ఇచ్చి తప్పారన్నారు. ప్రగతి భవన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోషామహాల్ కేసీఆర్‌కు కన్పించకపోవటం బాధాకరమన్నారు. గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్లను మాత్రమే కేసీఆర్‌ అభివృద్ధి చేస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-21T22:46:59+05:30 IST