కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2021-09-07T17:39:21+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలనకు..

కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి

రఘునాథపల్లి: రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేష్‌ పిలుపునిచ్చారు. మండలంలోని గిద్దబండ తండా గ్రామ పంచాయతీలో సోమవారం జరిగిన  కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో వల్లాల వెంకటేష్‌, ద్వావర రాజు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-07T17:39:21+05:30 IST