తమిళనాడులోని రంగనాథ దేవాలయాన్ని సందర్శించుకున్న కేసీఆర్
ABN , First Publish Date - 2021-12-13T22:38:33+05:30 IST
రెండు రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయాన్ని కుటుంబంతో సహా సందర్శించుకున్నారు. పూజారుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న..
చెన్నై: రెండు రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయాన్ని కుటుంబంతో సహా సందర్శించుకున్నారు. పూజారుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న కేసీఆర్.. అనంతరం దేవాలయ విశేషాలు చరిత్ర గురించి ఆలయ పూజారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్కు తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ ఆహ్వానం పలికారు.
కాగా, ఈరోజు ఐటీసీ హోటల్లో బస అనంతరం మంగళవారం తమిళనాడు సీఎం స్టాలిన్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. స్టాలిన్ ఇంట్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఇరు ముఖ్యమంత్రుల సమావేశం జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.