కేసీఆర్ పని అయిపోయింది: ఉత్తమ్కుమార్రెడ్డి
ABN , First Publish Date - 2022-02-21T01:41:02+05:30 IST
సీఎం కేసీఆర్ పని ఇక అయిపోయిందని, ఇంటికి పోవడం ఖాయమని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు.
హుజూర్నగర్: సీఎం కేసీఆర్ పని ఇక అయిపోయిందని, ఇంటికి పోవడం ఖాయమని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి డిసెంబరులో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కేసీఆర్ ఎన్ని పర్యటనలు చేసినా కాంగ్రె్సకే అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. హుజూర్నగర్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. ఎక్కడ పనిచేసినా అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే సైదిరెడ్డి 10శాతం కమీషన్ తీసుకుంటున్నాడని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.