20న మేడ్చల్‌కు కేసీఆర్‌?

ABN , First Publish Date - 2021-06-18T04:39:14+05:30 IST

పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను

20న మేడ్చల్‌కు కేసీఆర్‌?

మేడ్చల్‌ : పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించనున్న విషయం విధితమే. ఇందులోభాగంగా ఈనెల 20న సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌ గ్రామానికి విచ్చేస్తున్నట్లు తెలిసింది. 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో సీఎం పర్యటన ఖరారు కాగా, మేడ్చల్‌ మీదుగా ఆ జిల్లాలకు వెళ్తూ డబిల్‌పూర్‌ గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మేడ్చల్‌ పట్టణం నుంచి జాతీయ రహదారి వెంబడి ఇరువైపులా శుభ్రం చేయిస్తున్నారు. కాగా సీఎం పర్యటనపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని ఎండీవో శశిరేఖ తెలిపారు. 

Updated Date - 2021-06-18T04:39:14+05:30 IST