కేసీఆర్ అబద్ధాలతో వంచిస్తున్నారు
ABN , First Publish Date - 2021-03-05T05:31:17+05:30 IST
సీఎం చంద్రశేఖర్రావు తొలి నుంచి అబద్ధాలతో ప్రజలను వంచిస్తున్నారని, ఆయన కుమారుడు కేటీఆర్ సైతం కొత్త అబద్దాల రాజుగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ చెప్పిన లెక్కలన్నీ తప్పులతడకలే
వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధిరెడ్డి
భద్రాచలం/ మణుగూరు మార్చి 4: సీఎం చంద్రశేఖర్రావు తొలి నుంచి అబద్ధాలతో ప్రజలను వంచిస్తున్నారని, ఆయన కుమారుడు కేటీఆర్ సైతం కొత్త అబద్దాల రాజుగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన మణుగూరు భద్రాచలంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ చెప్పిన ఉద్యోగ నియామకాల లెక్కలే తప్పుల తడకలన్నారు. సింగరేణిలో 12 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారని వాస్తవానికి గతంలో కంటే ఉద్యోగస్థుల సంఖ్య తగ్గిందన్నారు. 5,800 మందికి ఉద్యోగాలిచ్చినా అవి వారసత్వం ఆధారంగా ఇ చ్చినవి మాత్రమేనని, కొత్తగా ఉద్యోగాలు సృష్టించింది ఏమీ లేదన్నారు. ఆయా సమా వేశాలల్లో రామ్మూర్తి, సుధాకర్, అక్కి నర్సింహారావు, కాటిబోయిన నాగేశ్వరరావు, రాములు, వీరాస్వామి