రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-01-09T21:20:56+05:30 IST

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని బీజేపీ నేత డీకే అరుణ దుయ్యబట్టారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది: డీకే అరుణ

మహబూబ్‌నగర్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని బీజేపీ నేత డీకే అరుణ దుయ్యబట్టారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేత సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని ప్రకటించారు. పాలమూరులో 317 జీవోకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని తెలిపారు. కరోనా పేరుతో బీజేపీ నిరసనలను అణిచివేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ నేతల కార్యక్రమాలకు కరోనా నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్‌ నేతలకు తొత్తులుగా మారారని ఆరోపించారు. 317 జీవోను సవరించే వరకు బీజేపీ పోరాడుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-09T21:20:56+05:30 IST