కృష్ణా జలాల వినియోగంపై కేసీఆర్ మౌనం వీడాలి: అరవింద్
ABN , First Publish Date - 2021-10-02T01:31:25+05:30 IST
కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాలను ఏపీ రాష్ట్రానికి విక్రయించి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని దుయ్యబట్టారు. జల వివాద సమస్యపై కేంద్రప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు పాల్గొనలేదో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్, సీఎం జగన్మోహన్రెడ్డిల మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాన్ని బయటపెట్టాలన్నారు. కృష్ణాజలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటాను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని అరవింద్ డిమాండ్ చేశారు.