కేసీఆర్కు దమ్ముంటే మాతో కలిసి పాదయాత్ర చేయాలి: షర్మిల
ABN , First Publish Date - 2021-10-23T00:47:05+05:30 IST
సీఎం కేసీఆర్కు దమ్ముంటే తమతో కలిసి పాదయాత్ర చేయాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు దమ్ముంటే తమతో కలిసి పాదయాత్ర చేయాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యానికి వైఎస్సార్ అధిక ప్రాధాన్యతిచ్చారని గుర్తుచఏశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్సార్ పరిపాలించారని చెప్పారు. ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, యువత, రైతులకు కేసీఆర్ అన్యాయం చేశారని షర్మిల ఆరోపించారు.
‘‘హుజురాబాద్లోనే దళితబంధు ఎందుకు అమలు చేస్తున్నారు? ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు పథకాలు గుర్తుకొస్తాయి. ప్రజాసమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా. సమస్యలుంటే కేసీఆర్ కుటుంబం మొత్తం రాజీనామా చేసి.. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి’’ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.