కారణజన్ముడు కేసీఆర్‌: రోజా

ABN , First Publish Date - 2022-02-13T00:27:05+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారణజన్ముడని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. శనివారం ఆమె యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించి బాలాలయంలో

కారణజన్ముడు కేసీఆర్‌: రోజా

యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారణజన్ముడని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. శనివారం ఆమె యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించి బాలాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రీశుడిని దర్శించుకున్నట్టు చెప్పారు. తిరుపతి తరహాలో యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని, యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించే భాగ్యం దక్కడం కేసీఆర్‌ పూర్వ జన్మ సుకృతమని కొనియాడారు. పూర్తిగా కృష్ణరాతి శిలలతో ఆలయాన్ని పునర్నిర్మించడం ఎంతో గొప్ప బృహత్కార్యమన్నారు. ఈ కాలంలో రాతితో ఆలయాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. శిల్ప నిర్మాణ పనులు చూసి ఆశ్చర్యానికి గురయ్యానని, కళాఖండాలను చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు. చాలా కాలం తర్వాత యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించానని, నేడు యాదాద్రి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రోజు తెలిపారు.

Updated Date - 2022-02-13T00:27:05+05:30 IST