చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

ABN , First Publish Date - 2022-01-27T20:05:30+05:30 IST

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు.

చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. కరోనా బారిన పడ్డ చిరంజీవిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులతో కూడా కేసీఆర్ మాట్లాడారు.


గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉన్న చిరంజీవి అనేకసార్లు ముఖ్యమంత్రిని కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలు, సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం విషయంలో కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపారు. కాగా తాను కరోనా బారిన పడినట్లు నిన్న చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి పరామర్శించడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-27T20:05:30+05:30 IST