TS News: కేసీఆర్ కొత్త నాటకం..లిక్కర్ స్కాం నుంచి జనం ద‌ృష్టిని మరల్చేందుకే : విజయశాంతి

ABN , First Publish Date - 2022-10-01T03:46:18+05:30 IST

Hyderabad: తన కూతురు కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకే శతవిధాలా ప్రయత్నిస్తున్నారని.. జనం దృష్టికి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని తెరమీదకు తెచ్చారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా..మునుగోడులో గెలిచేది తమ పార్టేనని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

TS News: కేసీఆర్ కొత్త నాటకం..లిక్కర్ స్కాం నుంచి జనం ద‌ృష్టిని మరల్చేందుకే : విజయశాంతి

Hyderabad: తన కూతురు కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకే కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని.. జనం దృష్టికి మరల్చేందుకే సీఎం కేసీఆర్ (CM KCR) జాతీయ పార్టీని తెరమీదకు తెచ్చారని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanti) ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా..మునుగోడులో గెలిచేది తమ పార్టేనని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 


విజయశాంతి పోస్టు యథాతథంగా..

‘‘కేసీఆర్ మరో కొత్త నాటకానికి తెర తీసిండు. తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి జాతీయ పార్టీ అంటూ.. సరికొత్త రాగాన్ని కేసీఆర్ అందుకున్నడు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు లిక్కర్ స్కాంలో ఇరుక్కుంది. కవితను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నరు. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ భజన బ్యాచ్ ప్రచారం చేస్తొంది. కేసీఆర్ పార్టీకి వందల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పార్టీకి కమీషన్ల ద్వారానే నిధులు పెరిగాయి. ప్రాజెక్టుల పేరు చెప్పి కోట్లు దోచుకున్నరు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్. మునుగోడు ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీసిండు. మునుగోడు ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నరు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీ విజయాన్ని ఆపలేరు.  రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నరు. కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు. ప్రభుత్వం చెప్పేదానికి... క్షేతస్థాయిలో జరిగిన అభివృద్ధికి పొంతననే లేదు. త్వరలోనే కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెప్పడం ఖాయం.’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-01T03:46:18+05:30 IST