నా మెసేజ్‌ KCRకు చేరితే చాలు: తమిళిసై

ABN , First Publish Date - 2022-06-10T22:24:28+05:30 IST

గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనలు జరిగిన నేపథ్యంలో

నా మెసేజ్‌ KCRకు చేరితే చాలు: తమిళిసై

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనలు జరిగిన నేపథ్యంలో మహిళల సమస్యలు వినాలని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించారు. ఇందుకోసం రాజ్‌భవన్‌లో ‘మహిళా దర్బార్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాజ్‌భవన్‌ నుంచి ప్రభుత్వానికి మెసేజ్ (message) ఇచ్చేందుకే తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ (KCR)ను కలిసి ఏడాది దాటిందని, తనను కలవకున్నా తన మెసేజ్‌ సీఎంకు చేరితేచాలని వ్యాఖ్యానించారు. వీసీలపై అధికారాలు తియ్యాలా వద్దా అనేది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ప్రజాదర్బార్ నిరంతర కార్యక్రమమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి రాజ్‌భవనేనని చెప్పారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఫాలో కావట్లేదని, అయినా తన కార్యక్రమాలు ఆపలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రవర్తన మార్చుకోవాలి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై మానిటరింగ్ చేస్తున్నామని, తన ఫిర్యాదులపై ప్రభుత్వ శాఖలన్నీ స్పందించాలని తమిళిసై పేర్కొన్నారు.

Updated Date - 2022-06-10T22:24:28+05:30 IST