హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌ఛార్జీలతో కేసీఆర్‌ భేటీ

ABN , First Publish Date - 2021-08-21T03:55:29+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఇన్‌ఛార్జీలతో హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం సమావేశమయ్యారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌ఛార్జీలతో కేసీఆర్‌ భేటీ

హుజూరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఇన్‌ఛార్జీలతో  హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెగ్మెంట్‌ స్థితిగతులపై ఇన్‌ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని గ్రౌండ్‌ లెవల్‌లో సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచిం చినట్లు తెలిసింది. ఇన్‌ఛార్జీలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. హుజూరాబాద్‌లో చేపట్టబోయే వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఉచిత కరెంటు, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం వచ్చేలా చూడాలన్నారు. ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్త కష్టపడి పనిచేసేలా కృషి చేయాలని కేసీఆర్ చెప్పారు. 

Updated Date - 2021-08-21T03:55:29+05:30 IST