నేడు కేసీఆర్ సభ
ABN , First Publish Date - 2020-11-28T07:29:45+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 5
ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
డివిజన్కు 3 వేల మంది తరలింపు
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల సభను ప్రారంభించాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. అప్పటికే మంత్రులు, గ్రేటర్లోని 150 డివిజన్ల నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు నిర్దేశించిన వేదికలపైకి చేరుకుంటారు.
కేసీఆర్ ప్రసంగం వీక్షించేందుకు స్టేడియం లోపల, బయట ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఒక్కో డివిజన్ నుంచి రెండు, మూడు వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గేటు వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు నేతలు చెప్పారు.