కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తున్నా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు: నాగం

ABN , First Publish Date - 2021-09-03T22:51:57+05:30 IST

కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని మాజీమంత్రి నాగం జనార్థన్‌రెడ్డి దుయ్యబట్టారు.

కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తున్నా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు: నాగం

హైదరాబాద్: కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని మాజీమంత్రి నాగం జనార్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటిపారుదల అధికారులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ జలవిద్యుత్ కోసమే అంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు వెళ్లాలని, కేసీఆర్‌కు ఎన్నిసార్లు లేఖరాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ వల్ల ఇద్దరు కాంట్రాక్టర్లు దేశంలోనే సంపన్నులు అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకటాటి పైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని నాగం జనార్థన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-09-03T22:51:57+05:30 IST