కృష్ణా జలాలపై కేసీఆర్‌ వైఖరి తెలపాలి: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-07-16T21:35:44+05:30 IST

కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని బీజేపీ నేత బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కృష్ణా జలాలపై కేసీఆర్‌ వైఖరి తెలపాలి: బండి సంజయ్‌

రాజన్న సిరిసిల్ల: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని బీజేపీ నేత బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల సీఎంలు కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. 2015 ఒప్పందం ప్రకారం తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సిఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారు అని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

Updated Date - 2021-07-16T21:35:44+05:30 IST