కేసీఆర్ను ఉరితీసినా తప్పులేదు: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-11-28T21:17:06+05:30 IST
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి దీక్షలో ఆయన మాట్లాడుతూ అసమర్థ కేసీఆర్ను ఉరితీసినా తప్పులేదన్నారు. కేసీఆర్ సంపాదన నిజాం కంటే ఎక్కువ ఉందని ఆరోపించారు. ఇంత దోపిడీదారును ఎక్కువ కాలం భరించొద్దన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. వేయి మందితో జంతర్మంతర్ దగ్గర దీక్ష చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్లో తాము అందరం పీసీసీ ప్రెసిడెంట్లమేనని చెప్పారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.