ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారు: ఉత్తమ్కుమార్
ABN , First Publish Date - 2022-01-31T00:33:02+05:30 IST
ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్ తప్పుబట్టారు.
హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్ తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 మంది సీనియర్లను పక్కనపెట్టి సోమేశ్కుమార్ను సీఎస్ చేశారని విమర్శించారు. ఇటీవల రజత్కుమార్ వ్యవహారం బట్టబయలైందన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డందుకు రజత్కుమార్కు ఇరిగేషన్లో పోస్టింగ్ ఇచ్చారని, 2016 బ్యాచ్ ఐఏఎస్లకు రెండేళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణకు రావడానికి ఐఏఎస్, ఐపీఎస్లు వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్లను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్న తీరును.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు.