కేసీఆర్ లేకుండా ఈటలకు ఈ స్థాయి వచ్చేదా?: హరీష్రావు
ABN , First Publish Date - 2021-09-30T20:35:46+05:30 IST
సీఎం కేసీఆర్పై బీజేపీ నేత ఈటల ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని మంత్రి హరీష్రావు దుయ్యబట్టారు.
కరీంనగర్: సీఎం కేసీఆర్పై బీజేపీ నేత ఈటల ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని మంత్రి హరీష్రావు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ లేకుండా ఈటలకు ఈ స్థాయి వచ్చేదా? అని ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. ఈటల మాటలు సత్యహరిచంద్రుడిలా ఉంటాయని, ఈటల చేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయని హరీష్రావు చెప్పారు.