TS News: పాపాల పరిహారం కోసమే కేసీఆర్ యాదాద్రికి కానుకలు : మాజీ మంత్రి పొన్నాల
ABN , First Publish Date - 2022-09-30T23:03:55+05:30 IST
Hyderabad: పాపాలు పరిహారం కోసమే సీఎం కేసీఆర్ (CM KCR) యాదాద్రికి కానుకలు సమర్పిస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) విమర్శించారు. కేసీఆర్ తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. దేశంలో కేసీఆర్ చేసినంత దోపిడీ ఏ సీఎం చేయలేదని, ఆ దోపిడీ డబ్బుతోనే జాతీయ పార్టీ పెడతానని.. దేవుడికి మొక్కుతే వరం ఇస్తాడా? అని వ్యాఖ్యానించారు.
Hyderabad: పాపాలు పరిహారం కోసమే సీఎం కేసీఆర్ (CM KCR) యాదాద్రికి కానుకలు సమర్పిస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) విమర్శించారు. కేసీఆర్ తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. దేశంలో కేసీఆర్ చేసినంత దోపిడీ ఏ సీఎం చేయలేదని, ఆ దోపిడీ డబ్బుతోనే జాతీయ పార్టీ పెడతానని.. దేవుడికి మొక్కుతే వరం ఇస్తాడా? అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఎనిమిదేళ్లలో వరంగల్కు చేసిందేమీ లేదని, సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాము లేవనెత్తిన అంశాలపై వరంగల్ టూర్లో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ పాలనలో దేవాదుల ప్రాజెక్టులో మూడో మోటారు ఎందుకు నడప లేదు? వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి మాట్లాడిన కేసీఆర్ .. ఎందుకు ఇప్పటి వరకు ఒక్క పైసా ఖర్చు చేయలేదు? టెక్ట్స్ టైల్స్ పార్క్ హామీ ఎటు బోయింది? వరంగల్ మురికివాడల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం హామీ ఏమైంది? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు పూర్తి కాలేదు? వరంగల్ ఎయిర్ పోర్ట్కు ఒక్క పైసా నైనా నిధులు మంజూరు చేశాడా? కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు సాధించలేక పోయారు? ’’ అని పొన్నాల ప్రశ్నించారు.