అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ కృషి
ABN , First Publish Date - 2022-01-25T05:04:38+05:30 IST
అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ కృషి
శామీర్పేట/కీసర, జనవరి 24: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేట మండల పరిషత్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ వివాహానికి పెళ్లికానుకగా రూ.1,00,116 అందజేస్తోందన్నారు. శామీర్పేట మండలం 68, తూంకుంట మున్సిపాలిటీ 35, మూడుచింతలపల్లి మండలంలోని 67 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఎంపీపీలు యెల్లుబాయ్, హారిక, తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్గౌడ్, ఆ యా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
- మంత్రిని కలిసిన కీసరగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు
మంత్రి మల్లారెడ్డిని కీసరగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించామని ఆలయ చైర్మన్ ఉమాపతిశర్మ, ఈవో సుధాకర్రెడ్డి తెలిపారు. సాయినాథ్గౌడ్, రమేష్, నరే్షగౌడ్, భాగ్యలక్ష్మి, మల్లారెడ్డి, భాస్కర్, వేణు ఉన్నారు.