ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-01-31T01:04:09+05:30 IST

ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు.

ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌

హైదరాబాద్: ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై  కేసీఆర్‌ చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు సీఎం ఇచ్చారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని కేసీఆర్‌ తప్పుబట్టారు.

Updated Date - 2022-01-31T01:04:09+05:30 IST