ఢిల్లీకి పరారైన కేసీఆర్: ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2022-04-12T02:31:29+05:30 IST
లంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి పారిపోయారని బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
హుజూర్నగర్: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి పారిపోయారని బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో సీఎం కేసీఆర్ దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మిల్లర్ల వద్ద రైతులను మేకల్లా బలి ఇస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్కు అధికారం అప్పగిస్తే ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు.