కేసీఆర్‌ కొత్తనాటకమే ‘దళితబంధు’: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-09-07T01:48:38+05:30 IST

సీఎం కేసీఆర్‌ దళితుల ఓట్ల కోసం ఆడుతున్న కొత్త నాటకమే ‘దళితబంధు’ పథకమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు.

కేసీఆర్‌ కొత్తనాటకమే ‘దళితబంధు’: జగ్గారెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ దళితుల ఓట్ల కోసం ఆడుతున్న కొత్త నాటకమే ‘దళితబంధు’ పథకమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడికి మసాలా పెట్టి దూలానికి కట్టేసినట్టు సీఎం కేసీఆర్‌ పథకాలు ఉన్నాయని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు కొంత మంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే గత ఏడేళ్లుగా దళితులపై దాడులు పెరిగాయని, మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ఈ రెండేళ్లు ఐకమత్యంగా కలిసి ఉండి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని జగ్గారెడ్డి కోరారు.  

Updated Date - 2021-09-07T01:48:38+05:30 IST