లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
ABN , First Publish Date - 2021-05-07T03:22:06+05:30 IST
రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్డౌన్ ..
హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్డౌన్ పరిష్కారం కాదని కేసీఆర్ అన్నారు. లాక్డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టినా కేసులు తగ్గడం లేదని, అంతేకాకుండా దానివల్ల జనజీవనం స్థంభించిపోతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రగతి భవన్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు, తీసుకోవాల్సిన అంశాలపై దాదాపు 4 గంటల పాటు అధికారులతో సీఎం చర్చించారు. అనంతరం వారికి కీలక ఆదేశాలిచ్చారు.