కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తెచ్చారు: కొప్పుల ఈశ్వర్
ABN , First Publish Date - 2020-10-01T01:52:06+05:30 IST
దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తెచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
జగిత్యాల: దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తెచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. నూతన రెవెన్యూ చట్టంపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలిసీ తెలియనట్లు మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్య జెండా మోసినందుకే.. జీవన్రెడ్డికి మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. జీవన్రెడ్డి ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు.