టాంజానియాలో కేసీఆర్ హరిత జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-02-17T04:59:05+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై టాంజానియా అధ్యక్షుడు వంగ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా

టాంజానియాలో కేసీఆర్ హరిత జన్మదిన వేడుకలు

డొడోమా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై టాంజానియా అధ్యక్షుడు వంగ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కోసి మిఠాయిలు పంచుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారని టాంజానియా ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులు కొనియాడారు. దేశంలోనే అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరుపొందారని టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు వంగ నర్సింహారెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి


కాగా.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. అదే విధంగా టీఆర్ఎస్ ఎన్నారై  కో - ఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని శాఖ సభ్యులు మొక్కలు నాటి నీరు పోశారు. సలేషన్ ఆర్మీలోని అనాథ పిల్లలకు పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ఎన్నారై టాంజానియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవీణ్ చంద్ర, కొత్త సంతోష్ రెడ్డి, కుశలవ్ రెడ్డి, సిరిపురం శ్రీనివాస్, కల్లోగి సైదులు, భాస్కర్ యాదవ్, సత్తు ప్రణీత్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ టాంజానియా ఎన్నారై అధ్యక్షులు వంగ నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ.. కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా తరుపున కోరుకుంటున్నామన్నారు.

Updated Date - 2020-02-17T04:59:05+05:30 IST