కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-16T04:14:24+05:30 IST

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన ఓంకారి గట్టుమల్లు (27) అనే కౌలు రౌతు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కౌలు రైతు ఆత్మహత్య
మృతిచెందిన కౌలు రైతు గట్టుమల్లు

కోటపల్లి, జనవరి 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన ఓంకారి గట్టుమల్లు (27) అనే కౌలు రౌతు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో 5 ఎకరాలు, అత్తగారి ఊరైన చెన్నూరు మండలం సండ్రవెల్లిలో మరో 3 ఎకరాల భూమిని గట్టుమల్లు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. ఈ యేడు అధిక వర్షాలతో పంట నీట మునిగి దిగుబడి ఆశించినంత స్థాయిలో రాకపోవడంతో కలత చెందాడు. మరో వైపు రెండు సంవత్సరాల క్రితం ట్రాక్టర్‌ కొనుగోలు చేయగా నష్టాలు రావడంతో తక్కువ ధరకు అమ్మడంతో ట్రాక్టర్‌ కొనుగోలుకు సంబంధించిన అప్పు పెరిగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన గట్టుమల్లు శుక్రవారం ఉదయం పత్తి చేను వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా  చెన్నూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య రాజమణితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తండ్రి హనుమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-16T04:14:24+05:30 IST