స్థానిక కోటా ఎమ్మెల్సీకి కవిత నామినేషన్ దాఖలు

ABN , First Publish Date - 2021-11-23T20:28:10+05:30 IST

నిజామాబాద్: సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

స్థానిక కోటా ఎమ్మెల్సీకి కవిత నామినేషన్ దాఖలు

నిజామాబాద్: సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. మంగళవారం స్థానిక కోటా ఎమ్మెల్సీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్, ఉమ్మడి జిల్లా ఎమ్మేల్యేలు ఉన్నారు. మొత్తం కవిత తరపున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. 90 శాతం ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, వారంతా సహకరించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని కవిత అన్నారు. కాగా మంగళవారంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు ముగుస్తుంది.

Updated Date - 2021-11-23T20:28:10+05:30 IST