వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది: కవిత

ABN , First Publish Date - 2022-04-10T16:25:59+05:30 IST

వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది: కవిత

ఢిల్లీ: వరి అంశంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు తెస్తున్నాయని హెచ్చరించారు.
దేశంలో రైతులను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు ఏంటో.. బీజేపీ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని కవిత వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-10T16:25:59+05:30 IST