కవితకు కరోనా

ABN , First Publish Date - 2022-09-13T00:20:14+05:30 IST

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కరోనా బారిన పడ్డారు. ఆమెకు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో వైద్యులను సంప్రదించారు.

కవితకు కరోనా

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)  కరోనా బారిన పడ్డారు. ఆమెకు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో వైద్యులను సంప్రదించారు. లక్షణాలను బట్టి ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ఆమెకు కరోనా (Corona) సోకినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కవిత తన వ్యక్తిగత ట్విట్టర్‌ (Twitter)లో వెల్లడించారు. రెండు రోజుల వ్యవధిలో తనను కలిసిన వారంతా హోం ఐసోలేన్ కావాలని, లక్షణాలు బయపడితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల మంత్రి  కేటీఆర్‌ కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచనలతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. కేటీఆర్‌‌ రెండుసార్లు కరోనా బారినపడ్డారు. 

Updated Date - 2022-09-13T00:20:14+05:30 IST