Nellore: కావలిలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-08-15T04:06:55+05:30 IST

కావలి (Kavali)లో వైసీపీ (Ycp) నేతల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కావలి హైస్కూల్ ఆవరణను ..

Nellore: కావలిలో వైసీపీ నేతల దౌర్జన్యం

నెల్లూరు: కావలి (Kavali)లో వైసీపీ (Ycp) నేతల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కావలి హైస్కూల్ ఆవరణను ఇసుక (Sand) డంపింగ్ యార్డుగా మార్చేశారు. రాత్రి వేళలో టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు.  హైస్కూల్ (High School) ఆవరణలో పెద్ద ఎత్తున ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. అడ్డుకునేందుకు స్థానికులు, విద్యార్థులు ప్రయత్నించారు. అయినా సరే ఆందోళనలను లెక్కచేయకుండా వైసీపీ నేతలు డంపింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. 


Updated Date - 2022-08-15T04:06:55+05:30 IST