Greeshma Press Meet.. వరలక్ష్మి రోజున అష్ట దరిద్రపు వీడియో దర్శనమిచ్చింది..

ABN , First Publish Date - 2022-08-07T18:35:42+05:30 IST

సీఎం జగన్ ఎంపీ గోరంట్ల మాదవ్ వ్యవహారంపై స్పందించడం లేదని టీడీపీ నేత కావలి గ్రీష్మ అన్నారు.

Greeshma Press Meet.. వరలక్ష్మి రోజున అష్ట దరిద్రపు వీడియో దర్శనమిచ్చింది..

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) వ్యవహారంపై స్పందించడంలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి  గ్రీష్మ (Kavali Greeshma)విమర్శించారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్ర మహిళలు వరలక్ష్మి రోజున అమ్మవారిని పూజిద్దామనుకుంటే అష్ట దరిద్రపు వీడియో దర్శనమిచ్చిందని మండిపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వస్తోందని సంతోషిద్దామనుకుంటే గోరంట్ల మాధవ్ గబ్బు పట్టించారని దుయ్యబట్టారు. గోరంట్ల తప్పు చేశారని వైసీపీలో ఏ ఒక్కరూ చెప్పడంలేదన్నారు. తుమ్మినా, దగ్గినా ట్వీట్లు పెట్టే విజయసాయి.. గోరంట్ల విషయంలో ఏ ట్వీట్ పెట్టడంలేదే? అని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నాయకులు ఆడవారికి మర్యాదివ్వరని స్పష్టంగా అర్థమైందన్నారు. అధికార మదంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వైసీపీని ప్రజలు క్షమించరని ‘ఛీ’ కొడతారని కావలి గ్రీష్మ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-07T18:35:42+05:30 IST