లక్షిత హత్యల నేపథ్యంలో Kashmiri Pandit ఉపాధ్యాయుల బదిలీ

ABN , First Publish Date - 2022-06-04T17:46:14+05:30 IST

జమ్మూకశ్మీరులో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను బదిలీ చేశారు...

లక్షిత హత్యల నేపథ్యంలో Kashmiri Pandit ఉపాధ్యాయుల బదిలీ

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను బదిలీ చేశారు.ఈ మేర జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ లను లక్ష్యంగా చేసుకొని హత్యాకాండ సాగిస్తున్నారు. శ్రీనగర్‌లో పనిచేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను లోయ నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది.కుల్గామ్ జిల్లాలో స్కూల్ టీచర్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ ప్రజలు పాల్గొన్నారు. బదిలీ చేయడంతో కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. 


Updated Date - 2022-06-04T17:46:14+05:30 IST